![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1084 లో.. దేవయాని కూర్చొని ఆలోచిస్తుంటే.. ధరణి వచ్చి దేనిగురించి ఆలోచిస్తున్నారని అడుగుతుంది. ధరణి ఏదో చెప్పబోయి ఆగిపోతుంది. నన్ను ఏమైనా తిట్టబోయావా అని దేవయాని అడుగుతుంది. అదేం లేదని ధరణి అంటుంది. నువ్వు ఒక తెలివి తక్కువ దానివి అని ధరణిని దేవయాని అంటుంటే.. లేదు అత్తయ్య, నేను చాలా తెలివిగలదాన్ని అని ధరణి అంటుంది.
నీక్కూడా తెలివి ఉందా అని దేవయాని అనగానే.. నేనొక పొడుపు కథ చెప్తాను దానికి సమాధానం చెప్పాలని ధరణి అంటుంది. అడుగు చెప్తానని దేవయాని అంటుంది. అంగట్లో అమ్మేది కాదు తక్కేట్లో పెట్టి తూచిది కాదు.. అది లేకపోతే మనిషే కాదు అని ధరణి పొడుపుకథ చెప్తుంది. ఇది మీరు చెప్పలేదు మీ అబ్బాయి వచ్చాక తనకి తెలుసేమో అడగండి అని ధరణి అంటుంది. నేను చెప్తానంటూ పొడుపు కథ గురించి దేవయాని ఆలోచిస్తుంటుంది. మరొకవైపు జైల్లో ఉన్న రాజీవ్ ని శైలేంద్ర కలుస్తాడు. నిన్ను పోలీసులకి పట్టించింది ఎవరని రాజీవ్ ని శైలేంద్ర అడుగుతాడు.. ఇంకెవరు ఆ వసుధార, మహేంద్రలు అని రాజీవ్ అనగానే.. హమ్మయ్య నేనని అనుకోవట్లేదని శైలేంద్ర అనుకుంటాడు. శైలేంద్ర గుచ్చి గుచ్చి అడుగుతుంటే.. అసలు దీని వెనకాల వాళ్ళు కాకుండా ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వాళ్ళు ఎవరో నువ్వు కనుక్కోమని శైలేంద్రతో రాజీవ్ అంటాడు. ఒకవేళ తెలిస్తే ఏం చేస్తావని శైలేంద్ర అడుగగా.. చంపేస్తానని రాజీవ్ అంటాడు. దీని గురించి తర్వాత మాట్లాడుతానంటూ శైలేంద్ర కంగారుగా వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత పొడుపు కథ గురించి ఆలోచిస్తున్న దేవయాని దగ్గరికి శైలేంద్ర వస్తాడు. దాంతో శైలేంద్రకి ధరణి చెప్పిన పొడుపు కథ గురించి దేవయాని అడుగుతుంది. నాకు తెలియదని శైలేంద్ర అంటాడు. అప్పుడే ధరణి వస్తుంది. దానికి సమాధానం చెప్పమని ధరణిని శైలేంద్ర అడుగుతాడు. చెప్పనంటూ ధరణి అంటుంది. రాజీవ్ ని కలిసాను.. వాడికి నేనే పట్టించానని తెలియదని దేవయానితో శైలేంద్ర చెప్తాడు. మరోవైపు శైలేంద్ర మాటలని మను గుర్తుకుచేసుకుంటాడు. మీరు శైలేంద్ర మాటలు పట్టించుకోకండి అని వసు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |